గీత స్మరణం

గీత స్మరణం


 పల్లవి :

 

 ఆమె: నీ జతగా నేనుండాలి

   నీ ఎదలో నే నిండాలి

 నీ కథగా నేనే మారాలి

 నీ నీడై నే నడవాలి

   నీ నిజమై నే నిలవాలి

 నీ ఊపిరి నేనే కావాలి

 అతడు: నాకే తెలియని

   నను చూపించి నీకై పుట్టాననిపించి

 నీ దాకా నను రప్పించావే

 నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి

 నేనంటే నువ్వనిపించావే

 ॥జతగా॥

 

 చరణం : 1

 

 ఆ: కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా

 రాలేదే... జాడైనా లేదే...

 అ: రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా

 పడుకోవే... పైగా తిడతావే...

 ఆ: లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే

   వదిలేస్తావా నన్నిలా

 అ: నీలోకంలో నాకంటే ఇంకేదో

   ఉందంటే నమ్మే మాటలా

 ॥జతగా॥

 

 చరణం : 2

 

 అ: తెలిసి తెలియక వాలింది

   నీ నడుమొంపుల్లో నలిగింది

 నా చూపు... ఏం చేస్తాం చెప్పు...

 ఆ: తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది

 నీ వైపు... నీదే ఆ తప్పు

 అ: నువ్వంటే నువ్వంటూ

   ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా

 ఆ: దూరంగా పొమ్మంటూ

   దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా

 ॥జతగా॥

 

 చిత్రం: ఎవడు (2013)

 రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి

 సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, గానం: కార్తీక్, శ్రేయాఘోషల్


 

 

 సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి.  

 ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు)

 పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1,

 సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034

 మెయిల్: sakshi.features@gmail.com


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top