నల్లగొండ, న్యూస్లైన్, నల్లగొండ జిల్లాను మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తాం..హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నల్లగొండలో మేకల అభినవ్స్టేడియంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ జయభేరి సభలో ప్రసగించారు. సభకు భువనగిరి, నల్లగొండ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సమావేశానికి ముందు బ్రదర్స్ ఇద్దరు వారి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి వారు ప్రసగించారు. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా పాటుపతానని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిం చేందుకు కృషిచేస్తామన్నారు. అదే విధంగా బ్రాహ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులు పూర్తి చేయించి 4 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందేలా చేయడమే తన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రాంత అభివృద్ధే ప్రధాన ధ్యేయమన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలి చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. ప్రజా సేవయే పరమావధిగా భావించి రేయింబవళ్లు వారి శ్రే యస్సు కోసం పాటుపడుతున్నానన్నారు. ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తెలంగాణలోనే అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవి ఇప్పిం చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు : ఎంపీ గుత్తా
ఈ ఎన్నికల్లో జిల్లా నుంచి టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని ఎంపీ సుఖేందర్రెడ్డి తెలిపా రు. అభ్యర్థులు ఎవరో తెలియని వారికి కేసీఆర్ పార్టీ టికెట్లు ఇచ్చాడన్నారు. ఉద్యమకారులకు కాకుండా తెలంగాణ ద్రోహులకు పార్టీ టికెట్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, సీపీఐ మునుగోడు అభ్యర్థి పల్లావెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీం దర్, డీసీసీ ధ్యక్షడు తూడి దేవేందర్రెడ్డి తదితరులు కోరారు.
సమావేశానికి వీరితో పాటు భువనగిరి, తుంగతుర్తి అభ్యర్థులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అద్దంకి దయాకర్, తండు శ్రీని వాస్గౌడ్, కాంగ్రెస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు ముంగి చంద్రకళ,మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, గుమ్ముల మోహన్రెడ్డి, బుర్రి శ్రీనివాస్రెడ్డి, గుత్తా తనయుడు అమిత్రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా
Published Thu, Apr 10 2014 3:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement