ప్రచారంలో సొమ్మసిల్లి పడిపోయిన రోజా
చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా వడదెబ్బ తగిలింది. శుక్రవారం ఏకాంబరకుప్పంలో ఎన్నికల ప్రచారం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రచారంలోనే సొమ్మసిల్లిపోవటంతో రోజాను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆమెకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.