ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి | Writing student ..Should read | Sakshi
Sakshi News home page

ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి

Nov 6 2016 1:29 AM | Updated on Jul 11 2019 5:37 PM

ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి - Sakshi

ప్రతి విద్యార్థికి రాయడం.. చదవడం రావాలి

గ్రామీణ ప్రాంత పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రాయడంతోపాటు చదవటం రావాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆర్‌జేడీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా డీఈఓగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి శనివారం రాయలసీమ ఆర్‌జేడీగా బాధ్యతలు చేపట్టారు.

కడప : గ్రామీణ ప్రాంత పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రాయడంతోపాటు చదవటం రావాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆర్‌జేడీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ ఆర్‌జేడీగా విధులను నిర్వహిస్తూ గత నెల 31న ప్రేమానందం పదవీ విరమణ చేసిన విషయం విదితమే. ఆయన  స్థానంలో కృష్ణా జిల్లా డీఈఓగా పనిచేస్తున్న సుబ్బారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు జిల్లాలలో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వం నిర్వహించనున్న సమగ్ర నిరంతర విద్యా విధానానికి పిల్లలను సంసిద్ధులను చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement