ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

Aug 31 2017 9:48 PM | Updated on Jun 1 2018 8:45 PM

మతిస్థిమితం లేని ఓ వివాహిత ఇంటి గవాచీ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కండ్లపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది.

కండ్లపల్లి, (పామిడి): మతిస్థిమితం లేని ఓ వివాహిత ఇంటి గవాచీ కొక్కికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కండ్లపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసింది. ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపిన వివరాలమేరకు... అనంతపురానికి చెందిన లీలావతికి కండ్లపల్లి గ్రామానికి చెందిన వీరాంజనేయులుతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెళ్లైన ఏడాదికే లీలావతి మతిస్థిమితాన్ని కోల్పోయింది.

బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా ఆమె ఉరివేసుకొంది. మృతురాలి తల్లి లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్చురీలో ఆమె మృతదేహాన్ని గుత్తి ఇన్‌చార్జ్‌ సీఐ ప్రభాకర్‌గౌడ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ ఆమె ఆత్మహత్యపై వివరాలను ఎస్‌ఐతో అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement