కొడకండ్ల మండలం రామవరం గాయత్రి క్వారీలో ఆదివారం పేలుడు సంభవించింది.
కొడకండ్ల మండలం రామవరం గాయత్రి క్వారీలో ఆదివారం పేలుడు సంభవించింది. ఇద్దరు దంపతులు క్వారీలో రాళ్లకు డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. ఈ ఘటనలో కుంచం సుజాత(30) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల మధ్య ఉంచిన పాత జిలెటిన్ స్టిక్స్ పేలి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచాడు గ్రామం. కూలీ పనుల నిమిత్తం అక్కడకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.