వడదెబ్బతో ఇద్దరు మృతి | two died by sunstroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఇద్దరు మృతి

May 24 2017 10:05 PM | Updated on Sep 28 2018 3:41 PM

వడదెబ్బతో బుధవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు.

వెల్దుర్తి రూరల్‌ : వడదెబ్బతో బుధవారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. రామళ్లకోట గ్రామం దాసరిపేటలో మహబూబ్‌బీ(57)..అధిక ఉష్ణోగ్రతలతో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఎండలో తిరిగి స్పృహ తప్పిపడిపోయారు. ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. అలాగే వెల్దురికి చెందిన ముత్యాల తిమ్మక్క (48) బుధవారం కూలీపనికి వెళ్లి అస్వస్థతకు గురైయ్యారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందారు. మృతురాలికి పెళ్లైన కుమార్తె ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement