మార్బుల్ పాలిష్ మిషన్ నడిపే ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు.
మార్బుల్ పాలిష్ మిషన్ నడిపే ఓ యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో చనిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం కొర్విచెల్మలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో శేఖర్(18) అనే యువకుడు మార్బుల్ పాలిష్ చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం మిషన్ నడుపుతున్న శేఖర్ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోయాడు.