పిడుగుపాటుకు దంపతులకు గాయాలు


వేములపల్లి మండలం మంగాపురంలో శుక్రవారం పిడుగుపాటుకు ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. పొలంలో వరినాట్లు వేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన ఈద మల్లయ్య(35), ఈద నాగమణి(32)లను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top