భూసేకరణ పనులు వేగవంతం చేయాలి | spedlly collect lands | Sakshi
Sakshi News home page

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

Sep 21 2016 12:45 AM | Updated on Sep 4 2017 2:16 PM

జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వాకాటి కరుణ అధికారులను ఆదేశిం చారు. హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీఓ లు, తహసీల్దార్లతో ఆమె సమీక్ష నిర్వహించారు.

  • కలెక్టర్‌ వాకాటి కరుణ
  • హన్మకొండ అర్బ : జిల్లాలో ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ వాకాటి కరుణ అధికారులను ఆదేశిం చారు. హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఆర్డీఓ లు, తహసీల్దార్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం జరుగకుండా రైతులు పాస్‌పుస్తకాలు, పట్టాలో ఉన్న రైతుపేరు, కాస్తులో ఉన్న రైతుల పేరు, అసై¯ŒS్డ భూములు, రికార్డుల్లో ఉన్న పొరపాట్లు సరిదిద్దాలని ఆదేశించారు. జాప్యానికి కారణాలు గుర్తించి సత్వరం పరిష్కరించాల న్నారు. ఈ సందర్భంగా రికార్డుల్లో తప్పులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు కలెక్టర్‌ బోర్డుపై రాస్తూ అధికారులకు వివరించారు. మొత్తంగా రెండు వారాల్లో భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు, జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
    హరితహారం మొక్కల 
    సంరక్షణకు ప్రాధాన్యం  
    జిల్లాలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. మంగళ వారం హైదరాబాద్‌ నుంచి అటవీ,పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్‌బీ మీనా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 4.37కోట్ల మొక్కల నాటినట్లు తెలిపారు. త్వరలో 4.50 కోట్ల లక్ష్యం చేరుకుంటామని ఆమె చెప్పారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకుంటన్నామన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ 98 శాతం పూర్తయిందని, త్వరలో మిగతాపనులు పూర్తి చేస్తామని అన్నారు. జేసీ ప్రశాంత్‌ జీవ¯ŒSపాటిల్, డీఎఫ్‌వో శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement