‘ప్రజానాట్య మండలి’ తరగతులు ప్రారంభం | 'Praja natya mandali' classes begin | Sakshi
Sakshi News home page

‘ప్రజానాట్య మండలి’ తరగతులు ప్రారంభం

Oct 1 2016 9:38 PM | Updated on Sep 4 2017 3:48 PM

ప్రజానాట్యమండలి కళారూపాలలో ప్రజల ఇబ్బందులు, కష్టాలు ప్రతిబింబించాలని పోగ్రసివ్, డెమోక్రటిక్‌ ఫోరం ఎమ్మేల్సీ ఎమ్‌విఎస్‌ శర్మ అన్నారు.

అమరావతి: ప్రజానాట్యమండలి కళారూపాలలో ప్రజల ఇబ్బందులు, కష్టాలు ప్రతిబింబించాలని పోగ్రసివ్, డెమోక్రటిక్‌ ఫోరం ఎమ్మేల్సీ ఎమ్‌విఎస్‌ శర్మ అన్నారు. శనివారం స్థానిక శ్రీరామకృష్ణ హిందూ హైస్కూల్‌ ఆడిటోరియంలో మూడు రోజులపాటు నిర్వహించే  ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణాతరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రజానాట్యమండలి ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ కళారూపాలు రూపొందించాలన్నారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొల్లి లక్ష్మీనారాయణ, ప్రజానాట్యమండలి ప్రతినిధి రమణలతో పాటు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి  సుమారు వందమందిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement