గాలివీడు ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన పలువురిని సస్పెండ్ చేస్తూ ఆ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.
గాలివీడు: గాలివీడు ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన పలువురిని సస్పెండ్ చేస్తూ ఆ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాంటేజ్ సూపర్వైజర్ మురళి, టెక్నికల్ అసిస్టెంటు కేశవయ్య, పూలుకుంట ఫీల్డు అసిస్టెంట్ రతీదేవి, వెలిగల్లు ఎఫ్ఏ రమణానాయక్, కొర్లకుంట ఎఫ్ఏ రమేష్లు అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో పీడీ రమేష్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. మరికొందరికి షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు ఆయన పేర్కొన్నారు.