వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది.
మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని జీపు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.