నల్గొండ జిల్లా కట్టంగూర్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం కారు, ఆటో ఢీకొన్నాయి.
కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడిని తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామానికి చెందిన పేరం సైదులు(70) గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.