త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలలో నోటా ఆప్షన్ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
హైదరాబాద్: త్వరలో ఖమ్మం, వరంగల్, అచ్చంపేట, సిద్దిపేట పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలలో నోటా ఆప్షన్ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలనుంచి నోటాను తొలగించిన సంగతి తెలిసిందే.