కార్మికుడిపై దుండగుల దాడి | murder attempt in hindupur | Sakshi
Sakshi News home page

కార్మికుడిపై దుండగుల దాడి

Dec 31 2016 11:09 PM | Updated on Jul 30 2018 8:37 PM

హిందూపురం రైల్వే రోడ్డులోని పల్లా లాడ్జి వద్ద ఎం.బీరేపల్లికి చెందిన తిమ్మారెడ్డిపై ఇద్దరు దుండగులు శనివారం కత్తితో దాడి చేశారని స్థానికులు తెలిపారు.

హిందూపురం అర్బన్‌ : హిందూపురం రైల్వే రోడ్డులోని పల్లా లాడ్జి వద్ద ఎం.బీరేపల్లికి చెందిన తిమ్మారెడ్డిపై ఇద్దరు దుండగులు శనివారం కత్తితో దాడి చేశారని స్థానికులు తెలిపారు. సూపర్‌ మిల్లు.బిలో కార్మికుడిగా పని చేసే అతను సెలవు తీసుకుని హిందూపురం వచ్చాడు. రైల్వేరోడ్డులో బైక్‌ స్టార్ట్‌ చేస్తుండగా ఇద్దరు అపరిచితులు వచ్చి కత్తితో అతని గొంతుపై దాడి చేశారు. దీంతో గడ్డం, చెవికి గాయాలయ్యాయి. బాధితుడు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారని స్థానికులు వివరించారు. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement