'ఎన్టీఆర్ బతికుంటే కన్నీరు పెట్టుకునేవారు' | Minister Harish Rao Slams TDP for joining hands with congress | Sakshi
Sakshi News home page

'ఎన్టీఆర్ బతికుంటే కన్నీరు పెట్టుకునేవారు'

Apr 25 2016 3:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఎన్టీఆర్ బతికుంటే కన్నీరు పెట్టుకునేవారు' - Sakshi

'ఎన్టీఆర్ బతికుంటే కన్నీరు పెట్టుకునేవారు'

టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని, అలాంటి బద్ధ శత్రువుతో పాలేరు ఉప ఎన్నిక కోసం టీడీపీ చేతులు కలపడాన్ని దిగజారుడుతనంగా రాష్ట్ర మంత్రి హరీష్‌రావు అభివర్ణించారు.

మెట్‌పల్లి: టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని, అలాంటి బద్ధ శత్రువుతో పాలేరు ఉప ఎన్నిక కోసం టీడీపీ చేతులు కలపడాన్ని దిగజారుడుతనంగా  మంత్రి హరీష్‌రావు అభివర్ణించారు. ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే దీన్ని చూసి బాధపడేవారని ఆయన సోమవారమిక్కడ అన్నారు.

మెదక్ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో  హరీష్‌రావు, ఎంపీలు కవిత, బాల్కసుమన్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో రూ.28 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల ఆధునికీకరణ పనులకు కూడా వారు ప్రారంభోత్సవం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement