‘నాణ్యత లేకుంటే ఏజెన్సీలు తొలగిస్తాం’ | meo warnings to midday meals agents | Sakshi
Sakshi News home page

‘నాణ్యత లేకుంటే ఏజెన్సీలు తొలగిస్తాం’

Jul 27 2016 11:48 PM | Updated on Sep 4 2017 6:35 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించకపోతే ఏజెన్సీలను తొలగిస్తామని మండల విద్యాశాఖాధికారి గంగప్ప పేర్కొన్నారు.

హిందూపురం టౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించకపోతే ఏజెన్సీలను తొలగిస్తామని మండల విద్యాశాఖాధికారి గంగప్ప పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో మండలంలోని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదనే సమాచారం తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ఏజెన్సీలను తొలగిస్తామని హెచ్చరించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని లేనిపక్షంలో బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement