భార్యను చంపిన కసాయి భర్త | Man kills 19 year old wife in Brahma Samudram | Sakshi
Sakshi News home page

భార్యను చంపిన కసాయి భర్త

May 17 2016 9:25 AM | Updated on Oct 9 2018 5:39 PM

బ్రహ్మసముద్రం మండలం పిల్లెలపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి భార్యను హతమార్చాడు.

బ్రహ్మసముద్రం(అనంతపురం): బ్రహ్మసముద్రం మండలం పిల్లెలపల్లి గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న అనే వ్యక్తి భార్యను హతమార్చాడు. వేకువజామున కోప్రోదిక్తుడైన రాజన్న భార్య మంజమ్మ(19)ను గొంతునులిమి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇరువురికి వివాహం జరిగి ఒక సంవత్సరం కావొస్తుండగా మనస్పర్ధలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement