జగన్ ప్రకటనతో ‘బాబు’లో వణుకు
కాకినాడ: జాతీయ ప్లీనరీలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను చూసి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందుకే హడావుడిగా బెల్ట్ షాపులను తొలగిస్తామంటూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారన్నారు. బుధవారం సాయంత్రం కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోక
- అందుకే బెల్ట్షాపుల తొలగింపు ప్రకటన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ: జాతీయ ప్లీనరీలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలను చూసి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అందుకే హడావుడిగా బెల్ట్ షాపులను తొలగిస్తామంటూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారన్నారు. బుధవారం సాయంత్రం కన్నబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక బెల్ట్షాపులు పది రెట్లు పెరిగిపోయాయన్నారు. జాతీయ రహదారుల్లోని మద్యం షాపులకు వెసులుబాటు ఇచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించారు. న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందని కన్నబాబు ఆరోపించారు. మద్యంపై వచ్చిన ఆదాయం కోసం వ్యవస్థనే నిర్వీర్యం చేశారంటూ తెలుగుదేశం సర్కార్పై కన్నబాబు మండిపడ్డారు. ఇప్పుడు బెల్ట్షాపులను తొలగిస్తామని ప్రకటన చేసిన చంద్రబాబు సర్కార్ బెల్ట్షాపులకు వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేసిన వారిపై నమోదు చేసిన కేసుల మాటేమిటని ప్రశ్నించారు. మద్యం, బెల్ట్షాపుల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా గడచిన మూడేళ్ళుగా ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయన్నారు. మద్యం కారణంగా మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయని, ఎన్నో కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకు దశలవారీగా మద్య నిషేధం, బెల్ట్షాపుల తొలగింపుపై జాతీయ ప్లీనరీలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారన్నారు. ఈ ప్రకటనకు అన్ని వర్గాల ప్రజల నుంచి, మహిళల నుంచి మంచి స్పందన కనిపించడంతో రాజకీయంగా ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకే చంద్రబాబు సర్కార్ బెల్ట్షాపులు తొలగిస్తామంటూ బీరాలు పలుకుతోందని విమర్శించారు.