రాప్తాడు: ఖరీఫ్లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయ న రాప్తాడుకు చెందిన కౌలు రైతు కాటమయ్య ఏడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఇప్పటి వరకు పంట పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టినట్లు ఈ సందర్భంగా రైతు వారి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందని, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదం టూ వాపోయాడు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వర్షం రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. గతంలో పంట నష్టపోతే బీమా పరిహారం ద్వారా లబ్ధి చేకూరేదని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా కూడా అందడం లేదని తెలిపారు. వేలాది మంది రైతులు పంట నష్టపోతే వంద ల సంఖ్యలో మాత్రమే ఇన్పుట్ సబ్సి డీ మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు.
పంట నష్టపోయిన ప్రతి రైతుకూ రూ. పది వేలు పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాప్తాడు డివిజన్ రైతు సంఘం నాయకులు కదిరప్ప, రామాంజినేయులు, చంద్రశేఖరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, పుల్లలరేవు గోపాల్, నాగేంద్ర, నారాయణ, హనుమంతరెడ్డి, పుల్లప్ప, బీరప్ప, మాధవరెడ్డి, యర్రపరెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ రైతులను ఆదుకోవాలి
Published Thu, Aug 25 2016 11:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement