తల్లీ, కూతుళ్లు దారుణ హత్య | Disputes over Assets leads to Brutal double murder in bapatla | Sakshi
Sakshi News home page

తల్లీ, కూతుళ్లు దారుణ హత్య

Oct 27 2016 7:22 AM | Updated on Sep 29 2018 4:52 PM

గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం దారుణం చోటుచేసుకుంది.

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గౌరు నాగమణి(40), ఆమె కూతరు కొట్టె సాయి లక్ష్మి(20)లు దారుణ హత్యకు గురయ్యారు. నాగమణి మరిది హనుమంతరావు ఇద్దరినీ రోకలిబండతో మోది హత్య చేశాడు. ఆస్తివివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement