asset disputes
-
ఆస్తుల బదిలీ సాఫీగా.. సులభంగా!
సుధాకర్ (71) తన మరణానంతరం తనకున్న ఏకైక ఇల్లు ఇద్దరు కుమారులకు సమానంగా చెందుతుందని వీలునామా రాశాడు. అనారోగ్యంతో సుధాకర్ 2022లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. మూడేళ్లు గడుస్తున్నా కానీ సుధాకర్ కోరిక నెరవేరలేదు. ఆ ఇంటి కోసం సోదరులిద్దరి మధ్య అంగీకారం కుదరడం లేదు. ఇంటిని విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకుందామని ఒకరు అంటుంటే.. మరొకరు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోవడం లేదు. దేశంలో వారసత్వ వివాదాల్లో ఎక్కువగా ఇళ్ల గురించే ఉంటున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. – సాక్షి, బిజినెస్ డెస్క్బెంగళూరు సంస్థ ‘దక్ష్’ 2017లో చేపట్టిన అధ్యయనం ప్రకారం.. దేశంలో మూడింట ఒక వంతు వివాదాలు భూమి, ఇంటి గురించే ఉంటున్నాయి. ఇందులో 80 శాతం వారసత్వ హక్కులకు సంబంధించినవే కావడం గమనార్హం. 2016 నాటి ఒక సర్వే ప్రకారం చూసినా 66 శాతం సివిల్ వివాదాలు భూమి, ఇల్లు గురించే ఉన్నాయి. ఒకరికి మించిన వారసుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, వీలునామాలో ఆస్తుల పంపకం అసమంజసంగా ఉండడం, వీలునామాల ఫోర్జింగ్, ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం తదితర అంశాలన్నీ కోర్టుల్లో న్యాయపోరాటాలకు దారితీస్తున్నాయి.ఆస్తుల పంపకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వివాదాలను సాధ్యమైన మేర తగ్గించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘చట్టపరమైన సంక్లిష్టతలు, పరిపాలనా ప్రక్రియలకు దూరంగా ఉండడం అసాధ్యం. అయినప్పటికీ, ఆస్తులను ఎప్పుడు, ఎలా బదిలీ చేయాలన్నది నిర్ణయించడం ద్వారా వీటిని పరిమితం చేయొచ్చు’’అని 5నాన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్ రోహిరా సూచించారు. అందరికీ ఒక్కటే పరిష్కారం కాదు.. బ్యాంక్ డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో పెట్టుబడులు తదితర ఆర్ధిక ఆస్తుల బదిలీ ఎంతో సులభం. వీటి విలువను ఏరోజుకారోజు సులభంగా లెక్కించొచ్చు. కనుక వీటిని ఎంత మంది వారసుల మధ్య అయినా సులభంగానే పంపిణీ చేయొచ్చు. స్థిరాస్తులైన భూమి, ఇల్లుతోపాటు ఆభరణాలు, పెయింటింగ్లు, కళాకృతుల పంపిణీ సవాళ్లతో కూడుకున్నదే.వీటి అసలైన విలువను అంచనా వేయడంలోనే సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఒకే ఇంటిని ఒకటికి మించి భాగాలుగా పంచే విషయంలో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అది న్యాయవివాదానికి దారితీయవచ్చు. కనుక ఈ విషయంలో సాధ్యమైన మేర వివాద రహితంగా పరిష్కారాన్ని చూడాల్సి ఉంటుంది. వీలునామా, ట్రస్ట్, గిఫ్ట్ డీడ్, ఆస్తులను విక్రయించి పంచడం.. ఆస్తుల బదిలీకి ఇలా ఎన్నో మార్గాలున్నాయి. వీటిలో సానుకూలతలే కాదు, ప్రతికూలతలూ ఉన్నాయి. తమకు అత్యంత అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. జీవించి ఉండగా /మరణానంతరం..జీవించి ఉండగా ఆస్తుల బదిలీకి గిఫ్డ్డీడ్ చేయడం, ఫ్యామిలీ ట్రస్ట్కు బదిలీ చేయడం తదితర మార్గాలున్నాయి. ఆస్తులను విక్రయించి అందిరికీ సమానంగా పంచొచ్చు. లేదా హెచ్యూఎఫ్కు గిఫ్ట్డీడ్ చేయొచ్చు. మరణానంతరం ఆస్తులు ఎవరికి చెందాలన్నది వీలునామా ద్వారా నిర్దేశించొచ్చు. ఆస్తుల విక్రయం తమ తదనంతరం ఆస్తుల పంపకంలో సమస్యలు వస్తాయని సందేహించే వారు జీవించి ఉండగానే వాటిని విక్రయించి వారసులకు బదిలీ చేయడం ఒక పరిష్కారం. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన పిల్లలు కలిగిన వారికి ఇది మరింత అనుకూలం. అనవసర ప్రక్రియలను నివారించి, సమయాన్ని ఆదా చేస్తుంది. న్యాయ వివాదాలకు ఆస్కారం ఉండదు. స్వార్జితం అయితే తమకు నచ్చిన విధంగా పంపకాలు చేసుకోవచ్చు.వీలునామా తన మరణానంతరం ఆస్తుల సాఫీ బదిలీకి వీలునామా ఉపకరిస్తుంది. చట్టబద్ధమైన వారసులు కాని వారికి సైతం ఆస్తుల పంపకాన్ని వీలునామా ద్వారా నిర్ణయించొచ్చు. ఆస్తులను ఎలా పంచాలనే విషయంలో ప్రత్యేక సూచనలు ఇవ్వొచ్చు. మైనర్ పిల్లల కోసం సంరక్షకులను నియమించొచ్చు. వీలు నామా రాసినా కానీ, ఆ ఆస్తులపై జీవించి ఉన్నంత కాలం యజమానికే హక్కు, అధికారం ఉంటాయి. వీలునామాను ఎప్పుడైనా సమీక్షించొచ్చు. సులభంగా తిరగరాయొచ్చు. కానీ, అస్పష్టతకు తా విస్తే భవిష్యత్తులో కోర్టు వివాదాల చిక్కు ఇందులో ఎక్కువ. వీలునామా ద్వారా ప్రైవేటు ట్రస్ట్ను సైతం ఏర్పాటు చేసి, మరణానంతరం అమల్లోకి వచ్చేలా నిర్ణయించొచ్చు. గిఫ్ట్ డీడ్ బహుమతి కింద ఒక వ్యక్తి తన స్థిర, చరాస్తులను స్వచ్ఛందంగా బదిలీ చేయడానికి గిఫ్ట్ డీడ్ అనుకూలిస్తుంది. జీవించి ఉండగా బదిలీ చేస్తున్నారు కనుక, తమ తదనంతరం న్యాయపరమైన, వారసత్వ వివాదాలకు అవకాశాలు చాలా తక్కువ. స్వీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే గిఫ్ట్ డీడ్ అనంతరం ఆ ఆస్తులపై బదిలీ చేసిన వారు హక్కును కోల్పోవడం ఇందులో ఉన్న ప్రతికూలత. ఫ్యామిలీ/ప్రైవేటు ట్రస్ట్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, 1882 కింద ఫ్యామిలీ లేదా ప్రైవేటు ట్రస్ట్ను ఏర్పాటు చేసి వాటికి ఆస్తులను బదిలీ చేయడం ఒక పరిష్కారం. ఇదొక చట్టబద్దమైన సంస్థ. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎవరికి ఏ మేరకు ఆస్తుల ప్రయోజనాలు అందించాలో ఇందులో పేర్కొనొచ్చు. ట్రస్టీల బాధ్యతలు, లబ్ధి్దదారులు, అస్తుల నిర్వహణ గురించి స్పష్టంగా ట్రస్ట్ డీడ్లో పొందుపరచాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, వారసులు, ఇతరులు చట్టపరంగా సవాలు చేయడాన్ని నిరోధిస్తుంది. లబ్ధిదారులకు రుణ దాతల నుంచి రక్షణనిస్తుంది.ఇందులో ఉన్న ప్రతికూలత ఆస్తులను ట్రస్ట్కు బదిలీ చేసిన తర్వాత వాటిపై స్వీయ నియంత్రణ కోల్పోతారు. హక్కులన్నీ ట్రస్టీ చేతుల్లోకి వెళతాయి. కాకపోతే ఆ ఆస్తుల హక్కుదారులను నిర్ణయించే అధికారం ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటుకు ఎంతో సమయం తీసుకుంటుంది. నిర్వహణ కూడా సంక్లిష్టమైనది. కొన్ని ఆస్తులు కాకుండా పెద్ద మొత్తంలో ఆస్తులున్న వారికి ఇది అనుకూలిస్తుంది. ట్రస్ట్ తరఫున ప్రత్యేక రికార్డుల నిర్వహణ, రిటర్నుల దాఖలు తప్పనిసరి. దీని సవరణ, రద్దు అన్నది ఎంతో కష్టమైనది. సెటిల్మెంట్ డీడ్ ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య అంగీకార పత్రం ఇది. కనుక న్యాయవివాదాలకు ఆస్కారం తక్కువ. దీన్ని రిజిస్టర్ చేసుకోకపోయినా కోర్టుల ముందు ఆధారంగా నిలుస్తుంది. రిజిస్టర్ చేసుకుంటే మంచిది. నిపుణుల సహకారంతో శ్రద్ధగా డ్రాఫ్టింగ్ చేసుకోవడం ద్వారా న్యాయవివాదాలను నివారించొచ్చు. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే తిరిగి కోర్టు అనుమతి లేకుండా రద్దు చేసుకోవడం కుదరదు. దీన్ని కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చు. ఉమ్మడి యజమాని మరొకరితో ఉమ్మడిగా ఆస్తులను కలిగి, సరై్వవర్షిప్ హక్కుతో ఉంటే.. అప్పుడు ఒకరి మరణానంతరం మరొకరికి ఆస్తులు బదిలీ అయిపోతాయి. నామినేషన్, బెనిఫీషియరీ (లబ్దిదారు) నమోదు చేస్తే, మరణానంతరం ఆస్తులను వారు క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించినట్టు అవుతుంది. ఈ విధానంలో వివాదాలకు అవకాశాలు ఎక్కువ.నామినేషన్ ఉంటే ఆస్తులపై హక్కులు వారసులకు ఆలస్యంగా బదిలీ అవుతాయని గుర్తుంచుకోవాలి. బెనిఫీషియరీ నమోదు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోతే సరైన లబ్ధిదారులకు ఆస్తుల బదిలీ జరగకపోవచ్చు. ఆస్తుల బదిలీ ఏ రూపంలో చేస్తున్నా.. దీనికంటే ముందు న్యాయ నిపుణుల సహకారం తీసుకోవడం ద్వారా సాధ్యమైన మేర వివాదాలు తలెత్తకుండా నివారించొచ్చు. ప్రాపర్టీ పంపకం సంక్లిష్టం చేయొద్దు..ఒక్కరే వారసులు ఉన్న సందర్భాల్లో ఆస్తుల బదిలీకి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాబోవు. ఒకరికి మించి వారసుల మధ్య ఆస్తుల బదిలీయే సంక్లిష్టం అవుతుంది. ఒక ఇల్లు ఉంటే సమానంగా పంచుకోండంటూ చెప్పడం సులభమే. కానీ, ఈ విషయంలో వారసుల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే వివాదాలతో విలువైన సమయం హరించుకుపోతుంది. రెండు ఇళ్లు ఉంటే ఇద్దరు వారసులకు చెరొకటి పంచడం కూడా అంత సులభమేమీ కాదు. రెండూ ఒకే ప్రాంతంలో, ఒక్కటే విస్తీర్ణంతో ఉంటే ఫర్వాలేదు. వేర్వేరు చోట్ల ఉన్నప్పుడు వాటి విలువ ఒకే రకంగా ఉండదు.ఇద్దరు వారసులూ ఒకే ప్రాపర్టీ కోరుకోవచ్చు. వారసుల్లో ఒకరు విదేశాల్లో ఉండి, ఒకరు ఇక్కడే స్థిరపడొచ్చు. విదేశాల్లో స్థిరపడిన వారు భారత్లో ఆస్తుల పట్ల ఆసక్తి చూపించరని, వాటి నిర్వహణ, పన్నుల చెల్లింపు వారికి భారంగా మారొచ్చన్నది నిపుణుల అభిప్రాయం. కనుక విదేశాల్లో స్థిరపడిన వారికి భౌతిక ఆస్తుల కంటే ఆరి్థక ఆస్తుల రూపంలో పంపకం మెరుగైన మార్గం అవుతుంది. ఒక్కటే ఇల్లు లేదా ఫ్లాట్ కలిగి, మరే ఆస్తుల్లేని వారు.. తమ తదనంతరం ఆ ఇంటిని విక్రయించి, వ చ్చిన మొత్తాన్ని వారసులకు సమానంగా బదిలీ చేయాలంటూ వీలునామా రాసుకోవడం మంచి ఆలోచన అని నిపుణుల సూచన. అంతేకానీ, ఒకే ప్రాపర్టీకి సమాన హక్కులు చెందేలా రాసినట్టయితే ఏకాభిప్రాయం కుదరని సందర్భాల్లో వివాదాలకు తావిచ్చినట్టు అవుతుంది. అన్నీ ఆలోచించాకే అడుగు..⇒ ఆస్తులను పోగేసి వారసులకు పంచిపెట్టాలా? అన్నది పూర్తిగా వ్యక్తిగత ఎంపికే. వారసుల కంటే ముందు తమ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. జీవితకాలం కష్టార్జితం వృద్ధాప్యంలో మెరుగైన జీవనానికి భరోసా ఇవ్వాలి. తమ అవసరాలకు పోను మిగిలినది తమ తదనంతరం వారసులకు పంపిణీ చేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ముఖ్యంగా పిల్లల చదువులకు ఉన్నదంతా ఖర్చు చేసి.. వారికి మెరుగైన భవిష్యత్తును అందించిన తల్లిదండ్రులు మిగిలిన కొద్ది ఆరి్థక వనరులు/ఆస్తులను తమ కోసమే వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ తమ అవసరాలకు మించి అదనంగా కలిగి ఉంటే అప్పుడు జీవించి ఉండగానే బదిలీ చేయడాన్ని పరిశీలించొచ్చు. ⇒ కొందరు పిల్లలకు ఆస్తులను పంపిణీ చేసే సందర్భంలో జీవిత భాగస్వామిని విస్మరిస్తుంటారు. ముందుగానే ఆస్తులన్నింటినీ పిల్లలకు పంచేసిన తర్వాత.. దంపతుల్లో ఒకరు ముందుగా కాలం చేస్తే అప్పుడు రెండో వ్యక్తి యోగ క్షేమాలను పిల్లలు పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. కనుక జీవిత భాగస్వామికి ఈ విషయంలో భరోసా కల్పించాలి. ⇒ పిల్లల్లో ఒకరిద్దరు గొప్పగా స్థిరపడి.. ఎవరో ఒకరు వైవాహిక జీవితం విచి్ఛన్నం కారణంగా తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉండొచ్చు. అలాంటి ప్రత్యేక కేసుల్లో వారు జీవితాంతం అదే ఇంట్లో నివసించే హక్కు (రైట్ టు రిసైడ్)ను వీలునామా ద్వారా కల్పించొచ్చు. ⇒ ఆస్తుల పంపకంలో పిల్లల ఆసక్తులను పట్టించుకోవాలి. వారికి ఇష్టం లేని ఆస్తులు, వ్యాపారాలను విడిచిపెట్టడం మంచి నిర్ణయం కాబోదు. అలా ఇ చ్చిన వ్యాపారాలు, ఇంటి నిర్వహణను వారు పట్టించుకోకపోతే కొంత కాలానికి వాటి విలువ క్షీణిస్తుంది. ⇒ ముఖ్యంగా మైనర్ పిల్లలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే వారి కోసం సంరక్షకులను వీలునామా ద్వారా నియమించుకోవచ్చు. లేదా ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించొచ్చు. ఇలాంటి వారికి ఆస్తుల బదిలీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. నిపుణుల సాయంతో వారికి జీవిత కాలం పాటు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడంపై దృష్టి పెట్టాలి. ⇒ ఆస్తుల బదిలీకి అనుకూలమైన చట్టబద్ధమైన ప్రక్రియలు, పన్ను బాధ్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన పిల్లలకు ఆస్తులను బదిలీ చేస్తుంటే.. వారు తమ దేశాల్లో పన్నులు చెల్లించాల్సి రావచ్చు. కనుక వీటి గురించి ముందే పిల్లలతో చర్చించాలి. ⇒ ఆస్తుల పంపకం అసంబద్ధంగా ఉంటే అది న్యాయ వివాదాలకు దారితీయవచ్చు. దీనివల్ల ఎన్నో ఏళ్ల విలువైన కాలంతోపాటు న్యాయపోరాటానికి ఎంతో వ్యయం చేయాల్సి వస్తుంది. ఆస్తుల బదిలీలో సాధ్యమైన మేర పారదర్శకతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ⇒ పిల్లలు ఇతర పట్టణాలు, విదేశాల్లో స్థిరపడినప్పుడు వారసత్వ ఆస్తుల పరిష్కారానికి తరచూ రావాల్సి వస్తే అది కష్టంగా మారుతుంది. ⇒ సక్సెషన్ సర్టిఫికెట్, చట్టబద్ధమైన వారసులేనన్న ధ్రువీకరణ, లెటర్ ఆప్ అడ్మిని్రస్టేషన్ పొందాలంటే వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలి. వీటికి కూడా ఎన్నో సార్లు తిరగాల్సి వస్తుంది. ⇒ తల్లిదండ్రుల పేరిట ఉన్న మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఇతర పెట్టుబడులు పిల్లలకు తెలియకపోవచ్చు. వీటి వివరాలను పిల్లలతో పంచుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన. ⇒ ఆస్తుల బదిలీ విషయంలో కొంత ఫీజు చెల్లించి నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడొద్దు. -
స్థల వివాదంలో కత్తితో దాడి
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి తాలూకాలోని మిడిగేశి గ్రామంలో ఒక ఆలయ స్థల వివాదం రక్తసిక్తంగా మారింది. దాడుల్లో ఒక వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ ఘోరం గురువారం రాత్రి జరిగింది. కత్తితో విచక్షణారహితంగా దాడి గ్రామంలో దేవాలయానికి చెందిన ఒక ఎకరా పొలంపై వివాదం నడుస్తోంది. ఈ పొలం పక్కనే ఉన్న భూమి కూడా తనదేనని శ్రీధర్ గుప్త గొడవచేసేవాడు. ఇది కోర్టులో ఉండగా రెండు వర్గాలకు చెందినవారు తరచూ గొడవపడేవారు. రాత్రి కూడా ఇలాగే ఘర్షణ జరిగింది. శ్రీధర్ గుప్త కత్తితో విచ్చలవిడిగా దాడి చేయడంతో రామాంజనయ్య (48), శిల్ప (38) అనే ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మల్లికార్జున అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడి మధుగిరిలో చికిత్స చేయించి తుమకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ గుప్త, అతని సంబం«దీకులు తమపై దాడి చేశారని మృతుల కుటుంబీకులు తెలిపారు. ఎస్పీ పరిశీలన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ కుమార్ శహాపూర్వాడ్ గ్రామానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను మధుగిరి ఆస్పత్రికి తరలించారు. మిడిగేశి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితుడు శ్రీధర్ గుప్త పరారీలో ఉన్నాడు. (చదవండి: 18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగాజలం జల్లుతూ..!) -
ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదని ...కన్న తండ్రి గొంతు కోసి నిప్పంటించి..
ఆగ్రా: ఆస్తులు తగాదాలు కుటుంబాలను ఎంతలా విచ్ఛిన్నం చేస్తాయో చెప్పనవసరం లేదు. పైగా ఆస్తి విషయంలో మనుషులు కూడా తన పర భేదం మరిచి అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ క్రమంలో తమ జీవితాలను కటకటాల పాలు చేసుకునేవారు కోకొల్లలు. అచ్చం అలాంటి ఘటనే ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వినిత్ కుమార్ అనే వ్యక్తి గత రెండు రోజులుగా ఇంటి విషయమై తండ్రితో గొడవ పడుతున్నాడు. అయితే తండ్రి ఇల్లు అమ్మడానికి నిరాకరించాడు. దీంతో కోపం పెంచుకున్న వినిత్ కుమార్ కన్నతండ్రిని గొంతు కోసి చంపాడు. అతను అక్కడితో ఆగకుండా తండ్రి మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కాల్చేశాడు. అయితే స్థానికులు సమాచారం అందిచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది అని చెప్పారు. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక నిందుతుడు నేరం చేసినట్లు అంగీకరించాడని కూడా చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మృతుడి భార్య ఆశాదేవి తన కుమార్తెతో కలిసి ఆగ్రాలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని తెలిపారు. (చదవండి: జీవనాధారం కోల్పోయి.. ఊపిరి తీసుకున్న ఆటో డ్రైవర్) -
కొడుకుల కిరాతకం!..డబ్బే ముఖ్యం.. తండ్రి హతం
కర్ణాటక(మండ్య): స్థలం అమ్మిన డబ్బులను పంచుకోవడంతో గొడవ జరిగి ఇద్దరు కుమారులు కన్న తండ్రిని దారుణంగా పొడిచి చంపిన దారుణం మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో చోటు చేసుకుంది. హతుడు మరికాళయ్య (60) కాగా కిరాతక కొడుకులు శశికుమార్, రాజేష్. ఇటీవల మరికాళయ్య ఒక ఎకరా భూమిని రూ.30 లక్షలకు అమ్మాడు. తలా రూ.10 లక్షలు తీసుకుందామని చెప్పాడు. కానీ కొడుకులు ముందే భూ కొనుగోలుదారుతో మాట్లాడి డబ్బు మొత్తం తమకే ఇచ్చేలా మాట్లాడుకున్నారు. దీంతో తండ్రి భూ రిజి స్ట్రేషన్కు సంతకం పెట్టలేదు. శుక్రవారం వారు తండ్రితో తీవ్రంగా గొడవపడి కత్తులతో పొడిచి పరారయ్యారు. బంధువులు మరికాళయ్యను మైసూరు ఆస్పత్రికి తరలించగా శనివారం మరణించాడు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ఆస్తి కోసం కన్నతండ్రినే కడతేర్చేందుకు యత్నం!...ఎయిర్గన్తో కాల్పులు జరిపి పరారైన కొడుకు
మైసూరు: ఆస్తి కోసం తండ్రిని కన్నకొడుకు ఎయిర్గన్తో షూట్ చేసి పరారైన సంఘటన మైసూరు విజయనగర పరిధిలో చోటు చేసుకుంది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో నెల రోజులుగా శివకుమార్, కొడుకు మధ్య రగడ జరుగుతోంది. ఆస్తిని తన పేరుమీద రాయాలని తండ్రితో గొడవ పడ్డాడు. స్నేహితులతో కలిసి ఎయిర్గన్తో కాల్పులు జరిపి పరారయ్యాడు. ఆ శబ్దాలకు చుట్టుపక్కల వారు వచ్చి గాయపడిన శివకుమార్ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కొడుకు, మిత్రులు పరారీలో ఉన్నారు -
సినిమాను మించిన మర్డర్: మూడు హత్యలతో ఉలిక్కిపడిన వరంగల్
అంతా.. 15 నిమిషాల్లోనే జరిగిపోయింది. పదునైన వేటకొడవళ్లు, ఎలక్ట్రిక్ రంపం.. మూడు హత్యలు.. ఒకరకంగా అతను ఊచకోత కోశాడు. కొత్త ఇల్లు రక్తసిక్తమైంది. వరంగల్నగరం ఎల్బీనగర్లో తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన చాంద్ పాషా, అతడి భార్య సాబీరా, బావమరిది ఖలీల్ను కేవలం నిమిషాల వ్యవధిలోనే వరుసబెట్టి నిందితుడు ఎండీ షఫీ హతమార్చాడు. 2.20 నుంచి 2.35 నిమిషాల వ్యవధిలోనే మూడు హత్యలు జరిగాయి. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కిపడింది. సాక్షి, వరంగల్ / ఎంజీఎం/ వరంగల్ క్రైం: తల్లిదండ్రులను తన కళ్లెదుటే కత్తులతో నరకడం.. అడ్డుకోబోయిన మేనమామను క్షణాల్లో మట్టుబెట్టడం.. తోడబుట్టిన తమ్ముళ్లపై పైశాచికంగా కత్తులతో దాడి చేయడం చూసిన ఆ యువతి గుండె పగిలిపోయింది.. కాపాడండి అంటూ ఆ క్షణం గొంతెత్తి అరిచింది. ఒక పక్క తల్లిదండ్రులు, మేనమామ రక్తం మడుగులో కొట్టుకొంటుకుంటుగా తమ్ముళ్ల రోదనలు చెవుల్లో మార్మోగాయి. బాబాయ్ వెంట వచ్చిన కిరాయి గుండాలు రక్త బీభత్సం సృష్టించి బయట పడ్డారు. వరంగల్ ఎల్బీనగర్లో జరిగిన దారుణ హత్య సంఘటనతో నగరంతోపాటు ఉమ్మడి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొత్త ఇల్లే హత్యకు కారణమైందా? చాంద్పాషా, షఫీ అన్నదమ్ములు. 20 ఏళ్లుగా పశువుల క్రయ విక్రయాలు చేస్తూ గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో సుమారు రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఇందులో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయి. రెండు, మూడుసార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీ జరిగినా.. లావాదేవీలు షఫీ చూసేవాడని, అతనే కట్టాలని చాంద్పాషా చెప్పుకొచ్చాడు. ఎల్బీనగర్లో సుమారు రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్పాషా ఏడాది కిందట కొత్త ఇంటిని నిర్మించాడు. అన్న తనకు అప్పులు వేసి, అతను మాత్రం డబ్బులు లేవంటూనే కోటి రూపాయలతో కొత్త ఇల్లు ఎలా కట్టుకున్నాడు. తనను మోసం చేసి డబ్బులు మిగుల్చుకున్నాడని కోపం పెంచుకున్నాడు. తనకు అప్పుల భారం తీవ్రమైందని, ఆదుకోవాలని అన్నావదినలను కోరినా వారు వినకపోవడంతో కోపం కాస్త కసిగా మారి హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. చనిపోయారని వెళ్లిపోయారు.. చాంద్పాషా, సాబీరా, ఖలీల్లను చంపాక చాంద్పాషా కుమారులు సమద్, ఫహాద్లు వచ్చారు. వారిని కూడా విచక్షణారహితంగా పొడిచారు. రక్తపు మడుగులో పడిపోవడంతో చనిపోయారని భావించి వెళ్లిపోయారు. కానీ ఆ తరువాత వారిలో చలనం ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడిలో పాల్గొన్నది స్నేహితులే.. ముగ్గురి హత్యలో పాల్గొన్న వారిలో ప్రధాన నిందితుడు షఫీకి సంబంధించిన స్నేహితులు, సేవకులు ఉన్నట్లు సమాచారం. వీరికి, చాంద్పాషాకు చాలాఏళ్లుగా పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం. వీరి పశువులు, మాంసం వ్యాపారంలో సుమారు 10 సంవత్సరాల పైన పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు షఫీ డ్రైవర్ కూడా ఈ హత్యల సంఘటనలో నిందితుడిగా ఉన్నాడు. చాంద్పాషా ఇల్లు కట్టుకునే సమయంలో నిందితుడు షఫీ దగ్గర ఉండి కట్టించాడు. ఆ ఇంట్లో అణువణువూ అతనికి తెలుసు. హత్య ఘటనలో పాల్గొన్న వారిలో ఒకరు పరకాల ప్రాంతానికి చెందిన నిందితుడు ఉండగా, మరొకరు నర్సంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం. హత్యకు గురైంది.. చాంద్పాషా (50), సాబీరా (42) (భార్య), ఖలీల్ (40) చాంద్పాషా బావమరిది క్షతగాత్రులు: చాంద్పాషా కుమారులు సమద్(21), ఫహాద్ (28) క్షణాల్లో ప్రాణాలు పోయాయి.. దుండగులు కత్తులతోపాటు దాడిలో రంపాన్ని వినియోగించడం వల్ల ఆ.. ముగ్గురు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయారు. చాంద్పాషా మెడను రంపంతో కోశారు. భుజాలు, చేతులపై పదునైన కత్తిపోట్లు ఉన్నాయి. మెడ భాగం పూర్తిగా కట్ అయి ఉంది. ముఖంపై పడిన కత్తిపోటుతో ముక్కు వరకు తెగింది. ఖలీల్పాషాకు గొంతు దగ్గర రంపంతో కోశారు. తల.. మొండం వేరు పడలేదు కానీ రెండింటి మధ్య పెద్ద ఖాళీ స్థలం ఏర్పడింది. చిన్నపాటి కాలువ మాదిరిగా మృత దేహాలపై గుర్తులు ఉండిపోయాయి. సాబీరా బేగం ముఖంపై పదునైన కత్తిపోటు పడింది. మెడపై రంపంతో కోసినట్లు ఉంది. ముగ్గురి మృతదేహాలకు ఎంజీఎం ఆస్పత్రి లో బుధవారం పోస్టుమార్టం నిర్వహించా రు. చాంద్పాషా కూతురు రూబీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ దగ్గు మల్లేష్ తెలిపారు. నింది తులపై 302, 307, 460 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వైద్యం కోసం హైదరాబాద్కు తరలింపు ఘటనలో గాయపడి ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమద్, ఫహాద్ను సోదరి రూబీనా బేగం స్థానికులతో కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు తరలించారు. ఎప్పుడు ఏమి జరిగిందంటే.. మంగళవారం అర్ధరాత్రి 1.45 : షఫీతోపాటు స్నేహితులు పీకల దాకా మద్యం తాగారు. 2.05 : ఆటోలో అందరూ ఎల్బీనగర్కు చేరుకున్నారు. 2.05 నుంచి 2.20 : ఎలక్ట్రిక్ రంపంతో చాంద్పాషా ఇంటి తలుపుల కింది భాగంలో సగం వరకు షఫీ కోశాడు. 2.20 : రంపం శబ్దం విని నిద్ర నుంచి లేచివచ్చిన చాంద్పాషా ఛాతిపై రఫీ రంపంతో కోశాడు. పదునైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత శరీరంలోకి పలుమార్లు కత్తితో పొడిచాడు. 2.23 : నిద్ర నుంచి లేచి అడ్డుకోబోయిన బావమరిది ఖలీల్ శరీరం ముందు భాగంలోకి పలుమార్లు పొడిచాడు. ఇలా దాదాపు రెండు నిమిషాల పాటు ఖలీల్ను విచక్షణారహితంగా నరికాడు. 2.25 : వీరి అరుపులు విని నిద్రలేచిన వదిన సాబీరాను కూడా పదునైన కత్తితో పొడిచి చంపాడు. 2.28 : ఈ రక్తపు మడుగుల్లో పడి ఆర్తనాదాలు చేస్తుండగా చాంద్పాషా కుమారులు సమద్, ఫహాద్లు లేచి వచ్చారు. వారిపై అదే పదునైన కత్తితో పొడిచాడు. దీంతో కుప్పకూలిపోయారు. 2.35 : షఫీతోపాటు నిందితులు వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్లిపోయారు. -
దారుణం : తండ్రీ కొడుకులను కొట్టిచంపి.. ఆపై
సాక్షి, విశాఖపట్నం : ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేగింది. బైక్పై వెళ్తున్న తండ్రీకొడుకులను దుండగులు మాటువేసి హతమార్చారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టి చంపి ఆపై కాల్చివేశారు. ఈ ఘటన డుంబ్రిగూడ మండలం కోచిగూడలో చోటుచేసుకుంది. వివరాలు.. కోచిగూడకు చెందిన తండ్రీకొడుకులు గమ్మిలి మోహనరావు, అప్పారావు బైక్పై పొరుగూరికి వెళ్తుండగా దారికాసిన ఇద్దరు వ్యక్తులు వారిని విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం వారికి నిప్పు పెట్టి బూడిద చేశారు. ఈ ఘటనకు ఆస్తి తగాదా కారణం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల గ్రామానికి చెందిన గమ్మిల అర్జున్, డొంబు ఈ హత్యలు చేసి ఉండొచ్చిని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆస్తి వివాదం.. అన్నను నరికేశాడు..
సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఆస్తి విషయంలో అన్నను చంపేశాడు ఓ తమ్ముడు. ఈ ఘటన శనివారం గుంటూరు జిల్లా గొల్లపల్లి మండలం గరికపాడులో చోటుచేసుకుంది. వివరాలివి.. గత కొద్ది రోజులుగా అన్నదమ్ములు ఆస్తి వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే మరొసారి ఆస్తి విషయంలో మాట్లాడుకుంటున్నారు. మాట మాట పెరిగి అది గొడవకు దారితీసింది. ఈ నేపథ్యలోనే అన్న గోపాల్ను తమ్ముడు గొడ్డలితో నరికాడు. దీంతో అతను రక్తపు మడుగులో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లీ, కూతుళ్లు దారుణ హత్య
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని నరాలశెట్టివారిపాలెంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గౌరు నాగమణి(40), ఆమె కూతరు కొట్టె సాయి లక్ష్మి(20)లు దారుణ హత్యకు గురయ్యారు. నాగమణి మరిది హనుమంతరావు ఇద్దరినీ రోకలిబండతో మోది హత్య చేశాడు. ఆస్తివివాదమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.