తిరుమలలో భక్తుల రద్దీ శనివారం అధికంగా ఉంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం అధికంగా ఉంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 28 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 67, 605 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.