మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామంలో శనివారం వేకువజామున వృద్ధదంపతులను హత్యచేశారు.
వృద్ధ దంపతుల దారుణ హత్య
Aug 13 2016 11:58 AM | Updated on Jul 10 2019 8:02 PM
నారాయణఖేడ్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామంలో శనివారం వేకువజామున వృద్ధదంపతులను హత్యచేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన అంబయ్య(75), సుశీలమ్మ(70) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని హత్య చేసి వారివద్ద ఉన్న నగలు, నగదు దోచుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement