ఒలింపియాడ్‌ పతకమే లక్ష్యం | chess champion prathyusha | Sakshi
Sakshi News home page

ఒలింపియాడ్‌ పతకమే లక్ష్యం

Aug 30 2016 9:51 PM | Updated on Sep 4 2017 11:35 AM

చెస్‌ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్‌లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్‌బైజాన్‌ దేశం బాకార్‌ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు.

  • చెస్‌ క్రీడాకారిణి ప్రత్యూష
  • తుని : 
    చెస్‌ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్‌లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్‌బైజాన్‌ దేశం బాకార్‌ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్‌ ఒలింపియాడ్‌ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు. ఇందులో ఏపీ నుంచి తనతోపాటు ద్రోణవల్లి హారిక, ఢిల్లీకి చెందిన  తానియా సత్యదేవ్, మహారాష్ట్ర నుంచి సౌమ్య స్వామినాథన్, ఒడిశాకు చెందిన పద్మినీ రీత్‌ ఉన్నారన్నారు. అజర్‌బైజా¯Œæకు బుధవారం బయలుదేరుతున్నట్టు ప్రత్యూష వివరించారు. ప్రస్తుతం 2,329 పాయింట్లతో ఉన్నానని, ఒలిపింయాడ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్‌ 10 నుంచి 16 వరకూ కోల్‌కతాలో జరిగే వుమెన్‌–ఎ టోర్నమెంట్, డిసెంబర్‌ 2 నుంచి 14 వరకూ లండన్‌లో జరిగే క్లాసిక్‌ టోర్నీ, సెప్టెంబర్‌ 18 నుంచి 28 వరకూ ఖతార్‌లో జరిగే ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌లలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. నవంబర్‌ నెలాఖరుకు మహిళా గ్రాండ్‌మాస్టర్‌ అవుతానని ప్రత్యూష వివరించారు.
     

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement