పెళ్లయి రెండు వారాలు కాకుండానే.. | bridegroom killed in an accident | Sakshi
Sakshi News home page

పెళ్లయి రెండు వారాలు కాకుండానే..

Sep 4 2016 12:55 AM | Updated on Jul 12 2019 3:15 PM

పెళ్లయి రెండు వారాలు కాకుండానే.. - Sakshi

పెళ్లయి రెండు వారాలు కాకుండానే..

కావలిరూరల్‌: పెళ్లై రెండు వారాలైనా కాలేదు. బైక్‌ అదుపు ఓ నవ వరుడు దుర్మరణం చెందాడు.ఈ సంఘటన శనివారం నెల్లూరు, ప్రకాశం సరిహద్దు చేవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది.

 
  •  బైక్‌ అదుపు తప్పి నవ వరుడు దుర్మరణం
కావలిరూరల్‌: పెళ్లై రెండు వారాలైనా కాలేదు. బైక్‌ అదుపు ఓ నవ వరుడు దుర్మరణం చెందాడు.ఈ సంఘటన శనివారం నెల్లూరు, ప్రకాశం సరిహద్దు చేవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరానికి చెందిన చంద్రగిరి గోవిందు, సుబ్బలక్షమ్మ కుమారుడు వంశీ (21)కి కావలి రూరల్‌ మండలం రుద్రకోటకు చెందిన మేనమామ కూతురు రమ్యతో గత నెల 20వతేదీన వివాహమైంది. శనివారం రుద్రకోటలో ఉన్న తన భార్యను బంధువులతో కారులో భీమవరం పంపించాడు. అనంతరం తాను ఒంటరిగా బైక్‌పై బయలుదేరాడు. చేవూరు వద్ద ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి బైక్‌ అదుపు తప్పి పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని కారు వంశీ నడుము మీదుగా ఎక్కి వెళ్లడంతో నడుము భాగం నుజ్జు నుజ్జు అయింది. అటుగా వెళ్తున్న ఒంగోలు అంబులెన్సు వారు తీవ్రంగా గాయపడిన వంశీని చూసి కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. సమాచారం అందుక్నున మృతుడి కుటుంబæులు ఏరియా ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కావలి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement