చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతు | boy missing in pond | Sakshi
Sakshi News home page

చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతు

Aug 1 2016 9:00 PM | Updated on Jul 12 2019 3:02 PM

చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతు - Sakshi

చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతు

స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని కోనాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది.

బాన్సువాడ టౌన్‌ : స్నానం చేసేందుకు చెరువులోకి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలంలోని కోనాపూర్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పులిగుండు తండాకు చెందిన లకావత్‌ శ్రీనివాస్‌ (24) ఇటీవల జరిగిన ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించాడు. రాతపరీక్షకు సన్నద్ధమయ్యేందుకు గాను హైదరాబాద్‌కు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. సోమవారం కటింగ్‌ చేయించుకొనిస్నేహితుడితో కలిసి ఇంటికి బయల్దేరాడు. మధ్యలో కోనాపూర్‌ చెరువులో స్నానం చేసేందుకని దిగాడు. ఎంతకీ శ్రీనివాస్‌ బయటకు రాకపోవడంతో అతడి స్నేహితుడు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి, పరారయ్యాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాస్‌ తల్లి ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. రాత్రి వరకు చెరువులో వెతికినా యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement