ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా నాగేందర్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా నాగేందర్‌రెడ్డి

Published Tue, Jun 7 2016 7:20 PM

ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా నాగేందర్‌రెడ్డి - Sakshi

రాయికల్: ఓవర్సిస్ ఫ్రెండ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షునిగా కరీంనగర్ జిల్లా వాసి నియమించబడ్డారు. ఎలిగేడు మండలం ర్యాంకర్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన కాసర్ల నాగేందర్‌రెడ్డిని నియమించినట్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ కవిత మంగళవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ..త్వరలోనే పూర్తి కమిటీని ప్రకటిస్తామన్నారు. ఆస్ట్రేలియాలో పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానని... తన నియామకానికి కృషి చేసిన ఎంపీ కవితకు నాగేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement