7 నుంచి అంతా ఆన్‌లైన్‌ | all are online from 7th | Sakshi
Sakshi News home page

7 నుంచి అంతా ఆన్‌లైన్‌

Oct 31 2016 11:17 PM | Updated on Oct 2 2018 3:04 PM

ఫైళ్ల నిర్వహణ నవంబర్‌ 7 వరకు మాత్రమే మాన్యువల్‌గా ఉంటుందని, ఆ తరువాత అంతా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందని జేసీ హరికిరణ్‌ పేర్కొన్నారు.

–డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో జేసీ ఆదేశం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఫైళ్ల నిర్వహణ నవంబర్‌ 7 వరకు మాత్రమే మాన్యువల్‌గా ఉంటుందని, ఆ తరువాత అంతా ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుందని జేసీ హరికిరణ్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. ఈ– ఆఫీసులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు వచ్చిన సమస్యలో కొన్ని...
– పాములపాడు మండలం భానుముక్కల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న బోజన  కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు పోన్‌ ద్వారా జేసీ దృష్టికి తీసుకొచ్చారు.
– దేవనకొండ మండలం పొట్లంపాడు గ్రామ సర్పంచ్‌ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. 
- కోవెలకుంట్లలో ఒకే వ్యక్తికి రెండు పాసుపుస్తకాలు ఉన్నాయని అందులో ఒక దానిని రద్దు చేయాలనే ఒక రైతు ఫిర్యాదు చేశారు.
– ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 2015–16కు సంబందించిన రుణాలు ఇంకా మంజూరు కాలేదని నందికొట్కూరు చెందిన వ్యక్తి,  వితంతు పింఛన్‌ రావడం లేదని పా ములపాడు మండలం ఇస్కాల గ్రామ మహిళ ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement