కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ మృతి | Woman Constable Died In Car Accident Tamil Nadu | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ మృతి

Jun 4 2018 8:16 AM | Updated on Aug 14 2018 3:22 PM

Woman Constable Died In Car Accident Tamil Nadu - Sakshi

పూంకుళలి (ఫైల్‌)

తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో ఆదివారం ఉదయం కారు ఢీకొని మహిళా కానిస్టేబుల్‌ ఒకరు మృతి చెందారు. పుదుచ్చేరి కూనిచం పట్టి ప్రాంతానికి చెందిన పూంకుళలి (23) రెడ్డియార్‌ పాళయం పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌. ఈమె అఅవివాహిత. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌లో విధులకు బయలుదేరారు.

పిళ్లయార్‌ కుప్పం ప్రాంతంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లింది. ఈ ఘటనలో పూంకుళలి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి పూంకుళలి మృతదేహాన్ని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement