బెజవాడ గ్యాంగ్‌వార్‌ : పండు అరెస్ట్‌ | Vijayawada Gang war : Main Accused Pandu Arrested | Sakshi
Sakshi News home page

విజయవాడ గ్యాంగ్‌వార్‌ : ప్రధాన నిందితుడు పండు అరెస్ట్‌

Jun 13 2020 10:12 PM | Updated on Jun 13 2020 10:18 PM

Vijayawada Gang war : Main Accused Pandu Arrested - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విజ‌యవాడ్ గ్యాంగ్ వార్ కేసులో ప్రధాన నిందితుడు పండు అలియాస్ మణికంఠను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గొడ‌వ‌లో గాయాలు అవ్వ‌డంతో గుంటూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో పోలీస్ ప్రొటక్ష‌న్ మ‌ధ్య అత‌డికి చికిత్స అందించారు. ప్ర‌స్తుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి కుద‌టప‌డ‌టంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పండు వ‌ద్ద నుంచి తోట సందీప్ హ‌త్య‌కు వినియోగించిన రెండు క‌త్తులు, బ్లేడ్ స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం అత‌డిని కోర్టులో హాజ‌రుప‌రిచారు. (చదవండి : బెజవాడలో అలజడి)

కాగా ఇప్ప‌టికే ఈకేసులో ఇరు వ‌ర్గాలకు చెందిన 33 మందిని పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో పదిహేను మంది కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుల‌పై రౌడీ షీట్లు తెరవనున్నారు. నేరచరిత్ర ఎక్కువగా ఉన్నవారిని నగరబహిష్కరణ చెయ్యాల‌ని నిర్ణ‌యించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
(చదవండి : పండు.. మామూలోడు కాదు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement