భారీగా బంగారం పట్టివేత

Three Crore Rupees Gold Seized At Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుపడింది. దాదాపు రూ.3 కోట్ల విలువైన బంగారాన్నిపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళుతున్న థామస్‌ అనే ప్రయాణికుడి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ధామస్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. థామస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరిన్ని వివరాల కోసం విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top