సినిమాకు వెళ్లి వచ్చేసరికి షాక్‌... | theft in bandlaguda | Sakshi
Sakshi News home page

బండ్లగూడలో దొంగల స్వైరవిహారం

Jan 15 2018 9:44 AM | Updated on Jan 15 2018 9:44 AM

theft in bandlaguda - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఆదివారం రాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. ఐదు ఇళ్లలోకి ప్రవేశించిన దొంగలు.. నగదు, బంగారు నగలను ఎత్తుకెళ్లారు. అక్కడున్న కారును కూడా  తీసుకెళ్లారు. బండ్లగూడ సాయిబాబా కాలనీకి చెందిన ఐదు కుటుంబాలవారు సినిమాకు వెళ్ళారు. అర్థరాత్రి ఇళ్లకు వచ్చి చూస్తే తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఐదిళ్లలో 48 తులాల బంగారు నగలు, ఒక కారు, రూ.1.30 లక్షల నగదు దోచుకెళ్ళినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement