
అధికారులు స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లు
సాక్షి, విశాఖపట్నం : నక్షత్ర తాబేళ్లను విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం విశాఖ రైల్వేస్టేషన్లో డీఆర్ఐ అధికారులు నిర్వహించిన సోదాల్లో ముఠా నుంచి 1125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను విజయవాడ నుంచి ఔరాకు తరలిస్తున్న ముగ్గురు మఠా సభ్యులను అధికారులు అరెస్ట్ చేశారు. తాబేళ్లను బంగ్లాదేశ్కు తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు.