ఘోర రోడ్డు ప్రమాదం​: 16 మంది మృతి

Road Accident In Rajasthan Jodhpur Area - Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  ఎదురెదురుగా వస్తున్న మినిబస్‌, కారు బలంగా ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం​ జరిగింది. ఈ ఘటనలో పదహారు మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగా గాయపడ్డారు. వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం జోధ్‌పూర్‌ సమీపంలో ఈ ఘటన చేటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. కాగా జాతీయ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top