ఆదోని (కర్నూలు): ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. నడిరోడ్డుపై గుంతలు పడి రెండు నెలలుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో ఓ వ్యక్తి సోమవారం అందులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. మాధవరం రోడ్డులో మడుగును తలపిస్తున్న గుంతలో సోమవారం సాయంత్రం దాదాపు 48ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని ఓ వ్యక్తి పడ్డాడు. స్థానికులు వెంటనే బయటకు తీసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్మార్టం నిర్వహిస్తే మృతికి కారణాలు తెలుస్తాయని డాక్టర్ తెలిపారు. అయితే మూర్చవ్యాధితోనే గుంతలో పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గుర్తు తెలియన మృతదేహంగా కేసు నమోదు చేసుకున్నట్లు అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ రామక్రిష్ణ తెలిపారు.
అధికారులే బాధ్యత వహించాలి
రెండు నెలల నుంచి కుంటను తలపించే స్థాయిలో గుంత పడి ట్రాఫిక్ స్తంభించి పోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపించారు. బస్సులు, ఆటోలు బురద నీటిలో కూరుకుపోయి నిలిచిపోతున్నాయని, ద్విచక్రవాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతను తెలియజేస్తూ సోమవారం ‘సాక్షి’ కూడా ‘నీటి కుంట కాదు రోడ్డే’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అయినా అధికారులు అటువైపు తొంగి చూడలేదు. ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ వ్యక్తి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, అందుకు వారే బాధ్యత వహించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
Published Tue, Aug 28 2018 7:28 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement