పీఎన్‌బీ హెడ్‌ క్యాషియర్‌ మృతి | PNB cashier body found | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ హెడ్‌ క్యాషియర్‌ అనుమానాస్పద మృతి

Mar 1 2018 1:01 PM | Updated on Apr 3 2019 5:34 PM

PNB cashier body found - Sakshi

పీఎన్‌బీ ఫైల్‌ ఫోటో

సాక్షి, లక్నో:దేశవ్యాప్తంగా పీఎన్‌బీ మెగాస్కాం రేపిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే..ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో  మరో షాకింగ్‌ ఉదంతం చోటు చేసుకుంది.   బ్యాంకు  ఉద్యోగి ఒకరు అనుమానాస్పద రీతిలో  గురువారం శవమై తేలారు.  దీంతో  బ్యాంకింగ్‌ వర్గాల్లో కలకలం రేగింది.

లక్నోకు చెందిన రోహిత్ శ్రీవాత్సవ (28)  ఉత్తర ప్రదేశ్‌లో బలరాంపూర్‌  పీఎన్‌బీ బ్రాంచ్‌లో  హెడ్‌ క్యాషియర్‌గా పనిచేస్తున్నారు. అయితే రోహిత్‌ మృతదేహాన్ని మంకాపూర్‌ రోడ్డులోని  కల్వర్ట్‌లో గుర్తించామని పోలీసు అధికారులు వెల్లడించారు. బంధువులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement