భీమవరంలో ఎం.ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Pharmacy Student Commits Suicide In Bhimavaram - Sakshi

సాక్షి, భీమవరం: ఎం.ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని అలేఖ్య..కాలేజీ సమీపంలోనే ఫ్రెండ్స్‌తో కలిసి ఒక గదిలో అద్దెకు ఉంటోంది. శని, ఆదివారాలు కళాశాలకు సెలవు కావడంతో స్నేహితులంతా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరేసుకుంది. తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top