క్లాస్‌రూమ్‌లో వివస్త్రను చేసి...! | Odisha Young Women Made To Strip | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూమ్‌లో వివస్త్రను చేసి...!

Nov 15 2017 5:27 PM | Updated on Nov 15 2017 5:27 PM

 Odisha Young Women Made To Strip - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌ : తరగతి గదిలోనే వివస్త్రను చేసి.. ఆపై వీడియో తీసి.. అడ్డొచ్చిన లెక్చరర్‌ను చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశంలో అడుగడునా కీచక పర్వం సాగుతోంది. మహిళలమీద జరిగే అఘాయిత్యాలు.. అత్యంత వికృతంగా ఉంటున్నాయి. ఒడిశాలోని మైథిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నవంబర్‌ 7న ఒక విద్యార్థినిపై ముగ్గురు కామంధులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. ముగ్గురిలో ఇద్దరిని గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నవంబర్‌7న బాధితురాలు ప్రాక్టికల్‌ తరగతులు ముగించుకుని ఇంటికి వెళుతోంది. కొద్దిదూరం వెళ్లాక హ్యాండ్‌బ్యాగ్‌ మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి తిరిగి తరగతి గదికి వచ్చినట్లు బాధితురాలు తెలిపారు. అప్పటికే క్లాస్‌రూమ్‌లో కాలేజీకి సంబంధంలేని ముగ్గురు యువకులు అక్కడ ఉన్నట్లు ఆమె తెలిపింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న ముగ్గురు యువకులు.. బాధితురాలిని.. అత్యంత పాశవికంగా, రాక్షసంగా మీద పడి అత్యాచారం చేశారు. అంతేకాక ఆమెను వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.

బాధితురాలి ఆర్తనాదాలు విన్న లెక్చరర్‌ అజయ్‌ కుమార్‌ ముగ్గురిని తీవ్రంగా ప్రతిఘిటించే ప్రయత్నం చేశారు. ముగ్గురు యువకులు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో లెక్చరర్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చినట్లు బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై లెక్చరర్‌తో కలిసి బాధితురాలు నవంబర్‌ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు బాధితురాలకి పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించడంతో.. ఆమె పోలీస్‌ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు కేసును రిజిస్టర్‌ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement