దారుణం: భార్య తలను శరీరం నుంచి వేరు చేసి..

Man Murders Wife Brutally In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : సత్యనారాయణపురంలో దారుణం చోటుచేసుకుంది. విడాకుల వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య తలనరికి అతికిరాతకంగా చంపాడో భర్త. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం సత్యనారాయణపురం శ్రీనగర్‌ కాలనీలో జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. శ్రీనగర్‌ కాలనీకి చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి  అదే ప్రాంతానికి చెందిన మణిక్రాంతి అనే యువతిని ప్రేమించి 2010లో వివాహం చేసుకున్నాడు. మొదట్లో వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్‌పై మణిక్రాంతి దాదాపు 10సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడితో వేరుపడిన ఆమె చివరకు విడాకులు తీసుకోవాలని నిశ్చయించుకుంది. భార్య విడాకులు తీసుకోవటం నచ్చని ప్రదీప్‌ ఆమెపై పగపెంచుకున్నాడు.

మణిక్రాంతిని చంపాలన్న కసితో ఆదివారం మధ్యాహ్నం ఆమెపై కత్తితో దాడి చేసి తల నరికి శరీరం నుంచి వేరుచేశాడు. అనంతరం దాన్ని తీసుకుని వీధుల్లోకి వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీయటంతో అతడు తలను బుడమేరులో పడేశాడు. అనంతరం సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తనను ఇబ్బంది పెట్టినందుకే భార్య తల నరికి చంపానని చెప్పుకొచ్చాడు. ప్రదీప్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top