ప్రేమ జంట ఆత్మాహుతి | Love Couple Commits Sucide in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట ఆత్మాహుతి

Jul 29 2019 7:30 AM | Updated on Jul 29 2019 7:30 AM

Love Couple Commits Sucide in Tamil Nadu - Sakshi

వివాహేతర సంబంధం ప్రేమ జంట ఆత్మాహుతి చేసుకున్న సంఘటన ఆత్మాహుతి చేసుకున్న ఘటన త్రిశూలంలో తీవ్ర సంచలనం శనివారం కలిగించింది

చెన్నై, టీ.నగర్‌: వివాహేతర సంబంధం ప్రేమ జంట ఆత్మాహుతి చేసుకున్న సంఘటన ఆత్మాహుతి చేసుకున్న ఘటన త్రిశూలంలో తీవ్ర సంచలనం శనివారం కలిగించింది. చెన్నై త్రిశూలం ప్రాంతానికి చెందిన అయ్యనార్‌ (38) లారీ డ్రైవర్‌ ఇతని భార్య సుశీల (32). వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి (26)తో అయ్యనార్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో అయ్యనార్‌కు అతని భార్య సుశీలకు మధ్య తరచుగా తగాదాలు ఏర్పడేవి.

దీంతో మనస్తాపానికి గురైన అయ్యనార్‌ ఒక నెల రోజుల క్రితం ప్రియురాలు కృష్ణవేణితో పీర్కంకరనై కామరాజ్‌ నగర్‌ ఎంజీఆర్‌ వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా, అయ్యనార్‌కు, ప్రియురాలికి మధ్య తగాదా ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన తగాదాలో కృష్ణవేణి ఇంట్లో ఉన్న కిరసనాయిల్‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకోనున్నట్లు బెదిరించింది. దీంతో భీతి చెందిన అయ్యనార్‌ కూడా ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు చేశాడు. అంతే కాకుండా ఒంటికి నిప్పు అంటించుకోవడంతో, అతన్ని కాపాడబోయిన కృష్ణవేణి కూడా మంటల్లో కాలింది. తీవ్రగాయాలైన ఇద్దరిని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సలు పొందుతూ ఇద్దరు ఆదివారం ఉదయం మృతి చెందారు. దీని గురించి పీర్కంకరనై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement