‘మమ్మల్ని వెంబడించి ఇబ్బందులు పెడుతున్నారు’

Jyoti Murder Case Relatives Protest At Collector Office In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలో హత్యకు గురైన యువతి జ్యోతి హత్యకేసులో పారదర్శకంగా విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద గిరిజన, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. జ్యోతి బంధువులు కలెక్టరేట్‌ వద్ద గల గేటు వద్ద బైఠాయించగా గిరిజనులు, దళితులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జ్యోతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమను వెంబడించి ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కలవటానికి రావటం తప్పా అని ప్రశ్నించారు. జ్యోతి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని, నిందితులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top