వివాహిత హత్య

Husband Killed Wife In Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత హత్యక గురైంది.  చెన్నై పల్లికరణై గాంధీ నగర్‌కు చెందిన అయ్యప్పన్‌ (42) లారీ డ్రైవర్‌. ఇతని భార్య సుందరి (32). వీరికి జయశ్రీ (10), వర్షిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సుందరికి అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు ఉన్నట్టు అయ్యప్పన్‌కు తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి వీధిలో ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు పిల్లలు కొద్ది సమయం తరువాత ఇంటి వద్దకు వచ్చారు.

ఆ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారని ఇరుగుపొరుగు వారిని విచారణ చేశాడు. అనుమానించిన ఇరుగుపొరుగు కిటికిలో నుంచి చూడగా సుందరి మంచంపై రక్తపు మడుగులో శవంగా పడి ఉంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పల్లికరణై పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టి సుందరి మృత దేహాన్ని పరిశీలించగా ఆమె గొంతు కోసి హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని  శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుందరి భర్త అదృశ్యమై ఉండడంతో భార్యను అతను హత్య చేసి పారిపోయి ఉండొచ్చుని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top