హీరా గ్రూపు కేసు.. 6వేల కోట్ల స్కామ్‌

Heera Group Case 6 Thousand Crores Fraud - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గొలుసు కట్టు వ్యాపారం పేరిట హీరా గ్రూపు మొత్తం ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్‌కు పాల్పడినట్లు సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సీసీఎస్‌ పోలీసులు లేఖ రాశారు. డిపాజిట్ల సేకరణలో ఉగ్రవాదులతో సంబంధాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా ద్వారా అరబ్‌ దేశాలకు భారీగా డబ్బు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఫైనాన్స్‌ ఇంటెలిజెన్స్‌, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఆరాతీస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top