స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ | Sakshi
Sakshi News home page

స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ

Published Wed, Jun 19 2019 8:10 AM

Gold Robbery in Friend House - Sakshi

నాగోలు: స్నేహితురాలి ఇంట్లో నగదు చోరీ చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేసిన సరూర్‌నగర్‌ పోలీసులు అతడి నుంచి రూ. 13.5 లక్షలు, సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ ప్రీత్‌సింగ్‌ వివరాలు వెల్లడించారు.. కర్మన్‌ఘాట్, మల్‌రెడ్డి రంగారెడ్డి కాలనీకి చెందిన పల్లెటి మేరీకి అదే కాలనీలో ఉంటున్న సిద్దిపేటకు బొమ్మగాని శ్రీనివాస్‌తో స్నేహం ఉంది. మేరీ ప్లాట్‌ కోనుగోలు చేసేందుకు రూ. 14 లక్షలు తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంది.  ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌  గత నెల 2న మేరీ ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళం పగులగొట్టి రూ. 14 లక్షలు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేసి అతడి నుంచి రూ. 13.5 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌ తరలించారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు, సరూర్‌నగర్‌ డీఐ వెంకటేశం, ఎస్‌ఐ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement