ఊపిరి తీసిన ఊయల తాడు | Girl Died Accidental Strangulation With Hammock In Guntur | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన ఊయల తాడు

Feb 10 2020 8:15 AM | Updated on Feb 10 2020 9:23 AM

Girl Died Accidental Strangulation With Hammock In Guntur - Sakshi

ఆదివారం సెలవు కావటంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న పశువుల కొట్టంలో వెదురు బొంగుకు తాడును కట్టి ఊయల ఊగుతోంది.

సాక్షి, దాచేపల్లి/గుంటూరు: ఊయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకోవడంతో ఓ చిన్నారి మృత్యు ఒడికి చేరింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు సుగాలి కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మూఢావత్‌ బద్దునాయక్, కమలాబాయి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె కూలి పనులకు వెళుతోంది. మిగిలిన ముగ్గురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హైస్కూల్‌లో చదువుకుంటున్నారు.

వీరిలో చిన్న కుమార్తె అయిన మూఢావత్‌ సిరి (10) ఐదో తరగతి చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న పశువుల కొట్టంలో వెదురు బొంగుకు తాడును కట్టి ఊయల ఊగుతోంది. ఆ క్రమంలో తాడు జారిపోయి బాలిక గొంతుకు బలంగా బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక సిరి మృతి చెందింది. పశువుల కొట్టం మీదుగా వెళుతున్న వ్యక్తులు సిరి తాడుకు వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికే బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులంతా భోరున విలపిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement