పోలీసులపై అల్లరి మూకల దాడి | Gang Attack On Police In YSR District | Sakshi
Sakshi News home page

Oct 28 2018 4:26 PM | Updated on Mar 19 2019 6:01 PM

Gang Attack On Police In YSR District - Sakshi

దాడికి గురైన కానిస్టేబుల్స్‌

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలోని ఎర్రముక్కపల్లి సర్కిల్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్‌పై అల్లరు మూకలు దాడికి పాల్పడ్డాయి. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ స్థానికుల ముసుగులో దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం..  బైక్‌ ప్రమాద విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ప్రమాదానికి గురైన బాధితులు 100 కాల్‌ చేశారు.

దీంతో ఇద్దరు కానిస్టేబుల్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తుండగా స్థానికుల ముసుగులో అల్లరి మూకలు దాడి చేశారు. సీసీ ​కెమెరా పుటేజీలను పరిశీస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కాగా పోలీసులపై దాడి చేసిన వారికి మద్దతుగా పీఎస్‌లో టీడీపీ నేత బాలకృష్ణ యాదవ్‌ కూర్చోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement