బీజేపీకి అనుకూల నాయకుడిని హత్య చేసిన ఉగ్రవాదులు

BJP Affiliate Shabir Ahmad Bhat Shot Dead By Terrorists - Sakshi

పుల్వామా :  జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ నాయకుడిని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా రాక్‌-ఇ-లిటర్‌ గ్రామానికి చెందిన షబ్బీర్‌ అహ్మద్‌ భట్‌ బీజేపీ అనుకూలంగా జిల్లాలో పనిచేస్తున్నారు.

కాగా మంగళవారం అర్థరాత్రి షబ్బీర్‌ను కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున 2.30గంటల పాంత్రంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో షబ్బీర్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరం నిండా బుల్లెట్లతో పడి ఉన్న మృతదేశాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top