ఆరుషి కేసులో కొత్త మలుపు | Aarushi Murder Case SC Admits Hemraj Wife Plea  | Sakshi
Sakshi News home page

ఆరుషి కేసులో కొత్త మలుపు

Mar 19 2018 6:03 PM | Updated on Sep 2 2018 5:20 PM

Aarushi Murder Case SC Admits Hemraj Wife Plea  - Sakshi

తల్వార్‌ దంపతులు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ఆరుషి జంట హత్యల కేసు మరో కొత్త మలుపు తిరిగింది. తల్వార్‌ దంపతులను నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ వచ్చిన అప్పీల్‌ను సోమవారం సుప్రీంకోర్టు స్వీకరించింది. పని మనిషి  హేమ్‌రాజ్‌ భార్య కుంకాల బంజాడే ఈ కేసుపై పునర్విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్‌ రంజన్‌ గోగయ్‌ నేతృత్వంలోని బెంచ్‌.. తల్వార్‌ దంపతులకు నోటీసులు జారీ చేసింది. 

2008లో దంత వైద్యులైన రాజేశ్, నూపుర్ తల్వార్‌ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పని మనిషి హేమరాజ్‌లు హత్యకు గరైయ్యారు.  ఈ కేసులో ఘజియాబాద్‌ కోర్టు తల్వార్‌ దంపతులను దోషులుగా తేలుస్తూ 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే  సరైన సాక్ష్యాలు లేని కారణంగా  ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్‌ కోర్టు నిర్దోషులుగా  తేలుస్తూ 2017లో తీర్పు వెలువరించింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement